అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, November 6, 2010

మూడో రోజు కివీస్‌ది

 భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌ మూడోరోజున కివీస్‌ వైపు నడిచింది. రైడర్‌ 103, విలియమ్స్‌ 87, మెక్‌కల్లమ్‌ 65, టైలర్‌56 పరుగులు సాధించి న్యూజీలాండ్‌ను పటిష్ట స్థితికి చేర్చారు. సెంచరీ చేసి మంచి వూపు మీద ఉన్న రైడర్‌ ను శ్రీశాంత్‌ ఔట్‌ చేయడంతో కివీస్‌ ఆట ముగిసే సమయానికి 331/5 చేసింది. భారత బౌలర్లలో ఓజా రెండు వికెట్లు, జహీర్‌, బజ్జీ, శ్రీశాంత్‌ తలో వికెట్‌ తీశారు. ఈ టెస్ట్‌ ఫలితం తేలాలంటే నాలుగో రోజు భారత్‌ కివీస్‌ను తొందరగా ఆలౌట్‌ చేసి మళ్లీ బ్యాటింగ్‌ చేసి మంచి టార్గెట్‌ పెట్టాల్సి వుంటుంది.
ఆల్‌ ది బెస్ట్‌ ఇండియా.................



సుందర్

No comments:

Post a Comment