అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, January 25, 2011

ఇన్నేళ్ళ స్వాతంత్ర్య భారతాన్ని ఆ నా "కొడుకులే" పరిపాలించాలా?

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 60 ఏళ్ళు దాటింది. గణతంత్రరాజ్యం ప్రకటించుకుని మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము. మనది సాధా సీదా రాజ్యాంగం కాదు ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. ఎన్నో దేశాల రాజ్యాంగాలను శోధించి మరెన్నో విలువలు, సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన అత్యున్నతమైన రాజ్యాంగం ఏమిచెబుతోంది? నేడు ఏం జరుగుతోంది.......?
ఇది పేరుకు ప్రజాస్వామ్య రాజ్యం కానీ ఇక్కడ నడుస్తున్న పాలన రాజరిక పాలన నెహ్రూ  పోతే.. ఇందిరా.. ఇందిరా పోతే... రాజీవ్‌... రాజీవ్‌... పోతే..... రాహుల్‌.. అంటే  నూటపది కోట్ల జనాభా ఉన్న భారత దేశాన్ని ఒకే ఒక కుటుంబం మాత్రమే పరిపాలించాలా..... వారి చెప్పుచేతుల్లోనే దేశ రాజకీయాలు నడవాలా.....?